| Daily భారత్
Logo




ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

News

Posted on 2026-05-03 11:50:01

Share: Share


ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు (ఆదివారం) అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందగానే ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఒక్కసారిగా మంటలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేక్ విహార్‌లోని ఓ భవనంలోని రెండో అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో అమర్చిన ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చి మొత్తం ఇంటిని అలుముకున్నాయి. అక్కడున్న వారు బయటకు రాకముందే మంటలు వేగంగా వ్యాపించాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న తొమ్మిది మంది బయటకు రాలేకపోయారు. అగ్నికి ఆహుతైన వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమించారు. 14 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది అక్కడికి చేరుకుని రెండు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

బడిపంతులుగా మారిన ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-06-20 12:14:40

Readmore >
Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >