Posted on 2026-08-10 03:31:22
డైలీ భారత్,కామారెడ్డి: శ్రీమాతా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "నెలకొక మంచి పని – నారాయణ సేవ" కార్యక్రమంలో భాగంగా 10వ సేవా కార్యక్రమం నిర్వహించారు.
కామారెడ్డికి చెందిన టి. రశ్వంత్ B.Sc (Data Science) రెండో సంవత్సరం చదువుతున్నారు. 5 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన రశ్వంత్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ప్రస్తుతం తల్లి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ, మేనమామ సహకారంతో కుటుంబాన్ని నడుపుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న శ్రీమాతా సేవ కుటుంబ సభ్యులు ట్రస్ట్ దృష్టికి తీసుకురాగా, ట్రస్ట్ సభ్యులు వెంటనే స్పందించి రశ్వంత్ చదువు కొనసాగేందుకు ₹7,500/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పట్నం శెట్టి శ్రీనివాస్, డా. పల్స హరీష్ గౌడ్, కోడిప్యాక సాయిరాం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, "విద్యాదానం మహాదానం. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు మన చిన్న సహాయం పెద్ద భవిష్యత్తునిస్తుంది. దాతలు ముందుకు రావాలని" విజ్ఞప్తి చేశారు.
#శ్రీమాతాసేవ #కామారెడ్డి #విద్యాదానం #డైలీభారత్
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >