Posted on 2026-08-14 05:41:23
గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీసేవ, మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల వివరాల సేకరణ
బాధితుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు మోసం.. 28కు పైగా కేసులు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: పోలీసుల పేరుతో అమాయకులను మోసం చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా నిందితులను చందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 28కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.18 వేల నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా మోతే మండలానికి చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ మీర్పేటలోని అల్మాస్గూడలో నివసిస్తున్న కిలుకాని సాయిచంద్ (30), సూర్యాపేటకు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్ మీర్పేటలో నివసిస్తున్న కట్కూరి శరత్ కుమార్ (31) ఈ సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
నిందితులు గూగుల్, టెలిగ్రామ్ ద్వారా మీసేవ కేంద్రాలు, మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాల ఫోన్ నంబర్లను సేకరించేవారని చెప్పారు. అనంతరం అమాయకులకు ఫోన్ చేసి తాము పోలీసు అధికారులమని పరిచయం చేసుకుని అత్యవసరంగా ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బులు అవసరమయ్యాయని, వెంటనే ఫోన్పే ద్వారా నగదు పంపించాలని నమ్మించేవారని వివరించారు.
మోసానికి ముందుగానే పెట్రోల్ బంక్ సిబ్బందిని సంప్రదించి తమ వాహనం లేదా బోర్ బండి రిపేర్కు వచ్చిందని, తమ సార్ డబ్బులు వారి ఫోన్ నంబర్కు పంపిస్తారని చెప్పి నంబర్ తీసుకునేవారని తెలిపారు. ఆ నంబర్ను మీసేవ నిర్వాహకులకు ఇచ్చి బాధితుల నుంచి ఆన్లైన్లో డబ్బులు బదిలీ చేయించేవారని, అనంతరం పెట్రోల్ బంక్కు వెళ్లి నగదును తీసుకునేవారని డీఎస్పీ తెలిపారు.
ఇదే తరహాలో చందుర్తి మండలానికి చెందిన చిలుక పెంటయ్యకు నిందితులు ఫోన్ చేసి తాము చందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిగా మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్నారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్లోని ఆసుపత్రిలో చేర్పించామని, అత్యవసరంగా రూ.70 వేలు అవసరమని నమ్మించారు.
నిందితుల మాటలను నమ్మిన పెంటయ్య డబ్బులు పంపేందుకు సిద్ధం కాగా, వారు హైదరాబాద్లోని ఓ పెట్రోల్ బంక్ ఫోన్ నంబర్ ఇచ్చారు. పెంటయ్య ఆ నంబర్కు రూ.70 వేలు ఆన్లైన్లో పంపించారు. డబ్బులు బదిలీ అయిన వెంటనే నిందితులు మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్ చేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన పెంటయ్య చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందుర్తి సీఐ రవీందర్, ఎస్ఐ రమేష్, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ జునైద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
నిందితుల నుంచి నేరం ద్వారా సమకూరిన సొమ్ములో భాగంగా రూ.18 వేల నగదు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ రవీందర్, ఎస్ఐ రమేష్, ఆర్ఎస్ఐ జునైద్, సిబ్బంది అనిల్, గంగారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు.
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >