| Daily భారత్
Logo




కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై దాడి

News

Posted on 2024-07-19 12:53:51

Share: Share


కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై దాడి

డైలీ భారత్, హైదరాబాద్: కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్​ సిబ్బందిపై ఒక వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన సనత్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన కరెంటు సిబ్బందిని తోటి సిబ్బంది స్థానికులు కలిసి ఈఎస్​ఐసీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యుత్​ ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సనత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్​ సంఘ నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం, ఎర్రగడ్డ ప్రాంతంలో విద్యుత్​ లైన్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న  శ్రీకాంత్​, మీటర్​ రీడర్​ సాయి ఉదయం మోతీనగర్​ మీటర్​ రీడింగ్​కు వెళ్లారు. మోతీనగర్​లోని రాముల పేరిట ఉన్న ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లు బకాయి రూ.9,858 చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు వచ్చి బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకొండని దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విద్యుత్​ సిబ్బంది ఎంసీబీ ఆఫ్​ చేసి విద్యుత్​ సరఫరాను నిలిపివేశారు. విద్యుత్​ నిలిపివేయడంతో పట్టలేని కోపంతో ఆ యువకుడు మీటర్​ రీడర్​ సాయి గణేశ్​ను పిడి గుద్దులతో తీవ్రంగా కొట్టి, మీదపడి తన్నాడు. అడ్డుకోబోయిన శ్రీకాంత్​ పై దాడి చేశారు. ఈ సంఘటనలో సాయి గణేశ్​ కుడి కన్ను, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ యువకుడిని స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి శ్రీకాంత్​ అతనిని వెంటనే ఈఎస్​ఐసీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యుల పర్యవేక్షణలో అతడు చికిత్స పొందుతున్నాడు. వెంటనే బాధితులు సనత్​నగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సనత్​నగర్​ పోలీసులు బీఎన్​ఎస్​ చట్టం ప్రకారం 142, 115 క్లాజ్​-2 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్​ ఉద్యోగ సంఘం తీవ్ర ఆగ్రహం : మీటర్​ రీడర్​, లైన్​ ఇన్​స్పెక్టర్​పై జరిగిన దాడిని విద్యుత్​ ఉద్యోగ సంఘం తీవ్రంగా ఖండించింది. మీటర్​ రీడర్లపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని అన్నారు. దీంతో తాము ఉద్యోగం చేయాలా వద్దా అనే సంశయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనపై యూనియన్​ ప్రతినిధులతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సంఘటనను సీఎండీ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. మీటర్​ రీడర్​పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >