Posted on 2026-05-20 08:50:43
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక - రాజీవ్ నగర్ కాలనీ (గాంధీనగర్) లో నివాసం ఉంటున్నటువంటి దారా సునీత,భర్త దారా రాజు మే 02 న గుండెపోటుతో అకాల మరణం చెందారు. సునీత ఇద్దరి ఆడపిల్లలు పెట్టుకుని దిక్కుతోచని దయనీయస్థితిలో ఉన్నది.
ఆ విషయం తెలుసుకున్న సారపాక గవర్నమెంట్ స్కూల్ లో 1997 సంవత్సరంలో 7వ తరగతి తమతో పాటు చదివినటువంటి చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి సునీతకు కొంత ఆర్థిక సహాయము అదేవిధంగా రెండు నెలలు నిత్య అవసరాలు సహాయం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రఫీ, నర్సింహారావు, కుమార్, మోహన్,హరింద్రచారి,ప్రవీణ్, సిద్ది రాజు ఇంకా కొంతమంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >