Posted on 2026-07-30 16:35:13
గుంతలమయంగా మారిన శ్రీనగర్ కాలనీ రోడ్లు... నడవడానికే కష్టం
బొందలుగా మారిన రోడ్లు... అవస్థలు పడుతున్న పాఠశాల పిల్లలు, వృద్ధులు
డైలీ భారత్, సిరిసిల్ల:సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీవాసులు వర్షపు నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీలోని అన్ని వీధుల్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున నిలిచిపోయింది.
రోడ్లన్నీ గుంతలతో బొందలుగా మారడంతో కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి, రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనివల్ల పాఠశాలలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు తెలిపారు.
ఈ సమస్యపై శ్రీనగర్ కాలనీ ప్రజలు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కి మరియు 2వ వార్డు కౌన్సిలర్ వేముల రాములు కి విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే స్పందించి, వర్షపు నీరు నిలిచిన గుంతల్లో మొరం పోయించి రోడ్లను బాగుచేసి, రాకపోకలకు అనుకూలంగా మార్చాలని కోరుతున్నారు.
ఆలస్యం చేయకుండా మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు చేపట్టి శ్రీనగర్ కాలనీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >