Posted on 2026-08-03 05:55:39
ఒంటరి జీవితం తోడుకోసం పాట్లు
డైలీ భారత్ డెస్క్: ఒంటరి జీవితానికి తోడు వెతుక్కున్న ఓ మెకానిక్ ఆశలపై కేటుగాళ్లు నీళ్లు చల్లారు. పెళ్లయిన మరుసటి రోజే నవవధువు కళ్లుగప్పి ఉడాయించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
స్థానికంగా మెకానిక్గా పనిచేస్తున్న ఆరిఫుద్దీన్ మొదటి భార్యకు దూరమయ్యాడు. వయసు మీరడంతో ఒంటరితనం భరించలేక, హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువతితో వివాహం చేసుకున్నాడు. అమ్మాయి కుటుంబ పరిస్థితి బాగాలేకపోవడంతో పెళ్లి ఖర్చులని రూ. 60,000 ఎదురు ఇచ్చాడు. పెద్దల సమక్షంలో లగ్గం జరిగిందని సంబరపడ్డాడు.
కానీ, పెళ్లి జరిగిన మరుసటి రోజే ఉదయం లేచి చూసేసరికి నవవధువు ఇంట్లో లేదు. ఎక్కడా వెతికినా ఆచూకీ దొరకలేదు. అమ్మాయి తరఫు వారి నుంచి కూడా స్పందన లేకపోవడంతో.. డబ్బుల కోసమే కొందరు కలిసి ఈ పెళ్లి నాటకం ఆడించారన్న అనుమానంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వధువు కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >