Posted on 2026-08-08 17:13:56
డైలీ భారత్, కామారెడ్డి: మానవత్వం కోసం ఒక చేయూత. కామారెడ్డి పట్టణం బృందావన్ కాలనీలో నివసిస్తున్న పండరి - స్వరూప కుటుంబం తీవ్ర అనారోగ్యం మరియు పేదరికంతో అల్లాడుతోంది. ఈ పరిస్థితిని గుర్తించిన శ్రీమాతా సేవా చారిటబుల్ ట్రస్ట్ దాతల సహాయంతో వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది.
ఇప్పటికే కొందరు దాతలు స్పందించారు. మచ్చ నాగరాజు స్వరూప గారికి ఒక పరుపును అందించారు. గంజి వెంకటేశం కిరాణా సామాను మరియు 3 బెడ్ షీట్లు ఇచ్చి ఆ కుటుంబానికి తోడుగా నిలిచారు. వారికి ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కానీ ఈ కుటుంబ పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. ప్రస్తుతం వారికి తినడానికి సరిపడా ఆహారం లేదు. ధరించడానికి కనీస వస్త్రాలు కూడా లేవు.
ఈ కుటుంబానికి అత్యవసరంగా కావాల్సినవి
ఆహారం: బియ్యం, పప్పులు, నిత్యావసర కిరాణా
బట్టలు: ఉపయోగించగలిగే పాత లేదా కొత్త వస్త్రాలు
గృహ సామాను: బెడ్ షీట్లు, దుప్పట్లు, పరుపులు
ఆర్థిక సహాయం
"ఒక కుటుంబం ఆకలితో బాధపడకుండా, ఒక తల్లి కన్నీళ్లు ఆరేలా మనమందరం కలిసి చేయి అందిద్దాం" అని శ్రీమాత సేవా కుటుంబం పేర్కొంది. _మానవ సేవే మాధవ సేవ_ అనే నినాదంతో స్పందించే దాతలు ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేశారు.
సహాయం అందించాలనుకునేవారు శ్రీమాతా సేవా చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించగలరు.
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >