Posted on 2024-09-07 20:27:52
హిందూ సాంప్రదాయ పండుగలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి
సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాల మహానాడు జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలకి ఆదర్శమని విగ్రహ దాత మంద పుల్లయ్య దంపతులు అన్నారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీకు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనాదిగా వస్తున్న ఆచారాలను గౌరవిస్తూ, పాటిస్తూ పండుగలు, ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకొని మానవ సంబంధాలనుమెరుగుపర్చాలన్నారు. ఉత్సవాల్లో పేద వర్గాలను భాగస్వామ్యం చేసి వారిలో సంతోషాన్ని నింపాలని కోరారు. ప్రజాస్వామ్య భారత దేశంలో కులమతాలకు అతీతంగా సోదరభావంతంతో పండుగలు జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. ప్రజలు భక్తి మార్గాన్ని ఎంచుకోవడం వల్ల రాగద్వేశాలకు దూరంగా ఉంటారని తద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందన్నారు. ఉత్సవ కమిటీలు భారీ మొత్తాన్ని వెచ్చించి ఉత్సవాలు జరుపుకోవడంతోపాటు పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం సాంప్రదాయమని, ఈ సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కొనసాగించి పలువురికి ఆదర్శంగా నిలవాలని, పోలీసు, రెవిన్యూ శాఖల సూచనలు పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జూలూరుపాడు మండలం మాల మహానాడు కమిటీ సభ్యులు మరియు యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >