Posted on 2024-09-08 09:03:14
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన మాలోత్ బాలు నాయక్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్ని కావడం పట్ల ప్రకృతి హరిత దీక్ష అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్ మొక్కతో ఆయనను అభినందించారు. బాలు నాయక్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని యందు ప్రస్తుతం పనిచేచున్నారు.గతంలో టేకులపల్లి మండలం ఏ హెచ్ ఎస్ గంగారం నందు పనిచేసినప్పుడు 10 వ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసినందుకు గురుపూజం రోజు భద్రాచలం గిరిజన భవన్ నందు జరిగిన వేడుకలలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. ఐఏఎస్ చేతుల మీదుగా "టీచర్స్ డే" సందర్భంగా అవార్డు తీసుకుంటున్నందుకు వారికి ప్రకృతి హరిత దీక్ష గౌరవ సభ్యులుగా హరిత దీక్ష తీసుకొని వందలాది మొక్కలు నాటి ఎందరికో ఆదర్శంగా ఉన్న ఆయన భవిష్యత్తులోఎన్నో ఉత్తమ అవార్డులు తీసుకోవాలని ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపక అధ్యక్షుడు మొక్కల రాజశేఖర్ అన్నారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సంఘం వెంకట పుల్లయ్య, ప్రపంచ పర్యావరణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడుబరిగెల భూపేష్, రాష్ట్ర కార్యదర్శి క్రాంతినాయుడు,కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు పి.కుమార్, సామర్ల సమ్మయ్య, రాజు, లగడపాటి రమేష్ చంద్, ఉపాధ్యాయుడు దస్తగిరి తదితరులు అభినందనలు తెలియజేశారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >