Posted on 2024-09-13 14:24:02
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదం మోపుతాం
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర
మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ మహానగరం తోపాటు తెలంగాణ నలుదిక్కులు అభివృద్ధి చెందేలా ట్రిబుల్ ఆర్, ఫోర్త్ సిటీ, విద్య-వైద్య రంగాలు లాంటి అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
అధికారం కోల్పోయామనే అక్కసుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కేఎల్ఆర్ మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని బీఆర్ఎస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
వ్యక్తిగత దూషణలు చేసుకుని బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలు చేస్తున్నారని... వాటిని ఏమాత్రం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సహించబోదని హెచ్చరించారు.
బిఆర్ఎస్ పాలనలాగా నిర్బంధాలు చేస్తే ప్రతిపక్ష నాయకులు రోడ్లపై తిరగలేరని కాంగ్రెస్ నేత గుర్తు చేశారు.
ప్రజా సమస్యలపై విలువైన సూచనలు ఇస్తే అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబితే ఇంత వరకు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రాలేదన్నారు కేఎల్ఆర్.
ఫామ్ హౌస్ ఆదేశాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు బలికావొద్దన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారు హెచ్చరించారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >