Posted on 2025-04-22 10:20:45
డైలీ భారత్, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీ చేసింది.. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది ..
హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది ..సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేష్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు.. ఇందు కొరకు 5.9 కోట్ల రూపా యల డబ్బుని మహేష్ బాబు, తీసుకున్నట్లు సమాచారం.
ఇందులో కొంత నగదు రూపంలో తీసుకోగా మరి కొంత ఆర్టిజిఎస్ రూపంలో ట్రాన్స్ఫర్ అయింది.. అయితే ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు సాయి సూర్య డెవలపర్స్ సురానా కంపెనీలో ఈ డి సోదాలు నిర్వహించిన ప్పుడు బయటపడింది ..
సోదాలు దొరికిన పత్రాల ఆధారంగా మహేష్ బాబుకి ఈడి నోటీసులు ఇచ్చింది.. సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలు పెద్ద మొత్తంలో వెంచర్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి..
ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు గతంలోని సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను అరెస్టు చేశారు.. అదే మాదిరిగా సూరానా గ్రూపు పైన కూడా కేసు నమోదు చేశారు.. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ డి విచారణ ప్రారంభించింది..
ఈ నేపథ్యంలోనే ఈనెల 16వ తేదీన ఈడి రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్ , సూరన గ్రూపు లో సోదాలు నిర్వహించిన సంగతి పాఠకులకు తెలిసిందే.
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >