Posted on 2025-05-10 11:12:00
భద్రాచలం చెక్పోస్ట్ వద్ద 29.500 కేజీల గంజాయి పట్టివేత.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /భద్రాచలం: ఒరిస్సా మల్కాన్ గిరి జిల్లా నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయిని తరలిస్తున్నట్లు అందుకున్న సమాచారం మేరకు భద్రాచలం ఎక్సైజ్ పోలీసులు చెక్పోస్ట్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానం వచ్చినటువంటి కారును నిలిపి లోపల పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని బయటకు తీసి తూకం వేయగా 29.500 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు భద్రాచలం సిఐ రహీం ఉన్నిసా బేగం తెలిపారు.
పట్టుకున్న గంజాయి విలువ రూ. 14 లక్షల 50 వేలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో కడపకు చెందిన సాయి కృష్ణ, పవన్ రెడ్డి, హైదరాబాదు కు చెందిన శ్రీహరి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
గంజాయితో పాటు కారును కూడా సీజ్ చేసినట్లు సిఐ పేర్కొన్నారు. గంజాయిని పట్టుకున్న కేసులో
అసిస్టెంట్ కమిషనర్ కరంచంద్ సీఐ రహీం మున్నీసా బేగం సిబ్బంది ఉన్నారు.
గంజాయిని పట్టుకున్నటువంటి భద్రాచలం పోలీసుల ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఎక్సైజ్ సూపరిండెంట్ జానయ్యలు అభినందించారు.
నేరెళ్ల పీహెచ్సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >