Posted on 2025-05-26 06:40:16
పక్కా ప్లాన్ తో చోరీ లు చేస్తున్న గుడివాడ కి చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు
ముఠా సభ్యుల చోరీల వివరాలు వెల్లడించిన గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్
డైలీ భారత్, కృష్ణా జిల్లా:పగలు కొత్తిమీర కరేపాకు అమ్ముతూ.... రాత్రుళ్ళు చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
కేసు వివరాలను గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ మీడియా సమావేశంలోవెల్లడించారు.
పమిడిముక్కల, కూచిపూడి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ముఠా సభ్యులను పట్టుకున్నారు.
వారి వద్ద 3 లక్షలు విలువైన 26 గ్రాములు బంగారం.....562 గ్రాముల వెండి ,3500 నగదు ,రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలియజేశారు.
ముఠా సభ్యులపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని,నిందితుల్లో ఒకరు మైనర్ కావడం విశేషమన్నారు.
పగలు కొత్తిమీర కరివేపాకు అమ్ముతున్నట్లు ఊర్లలో తిరుగుతూ, తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రిళ్ళు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని గుడివాడ డిఎస్పి ధీరజ్ వినీల్ తెలియజేశారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >