Posted on 2025-07-07 12:30:05
ప్రజావాణిలో వీల్ చైర్ పై వచ్చి తమ సమస్యను పరిష్కరించాలంటూ వికలాంగ వృద్ధ మహిళ వినతి
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన మేడగం వెంకటలక్ష్మి అను ఓ వృద్ధ వికలాంగ మహిళ తమపై అరాచకాలు గురిచేస్తున్న తన పెద్ద కుమారుడు రెండు ఏళ్ల నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగిందని అప్పటినుండి తన పెద్ద కుమారుని కుమారులు వరుసకు సొంత మనుమళ్లు రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి లు తన పేరుపై ఉన్న పట్టా భూమి ఐదు ఎకరాలతో పాటు ఉమ్మడి ఇల్లును కూడా అక్రమంగా వారిని వారి పేరు మీద మార్చుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్యాంక్ ఎకౌంట్, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్కులు కూడా తమ వద్ద నుండి బలవంతంగా లాక్కొని తమ పేరు మీద వ్రాయించుకున్నారని ఇదేంటి అని అడిగితే ఎక్కువగా మాట్లాడవద్దు అతిగా ప్రవర్తిస్తే పెట్రోలు పోసి తగిలేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని వృద్ధురాలు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనతో పాటు వచ్చిన తన కూతురు మనమరాళ్లు కు మీడియా వివరణ అడిగితే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారని తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆర్డిఓ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వృద్ధురాలు పేరుమీద ఉన్న భూమిని ఆమెకే చెందే విధంగా చూడాలని ఆదేశించడం జరిగిందని వారు తెలిపారు
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >