Posted on 2025-07-07 16:00:05
ప్రజావాణిలో వీల్ చైర్ పై వచ్చి తమ సమస్యను పరిష్కరించాలంటూ వికలాంగ వృద్ధ మహిళ వినతి
డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన మేడగం వెంకటలక్ష్మి అను ఓ వృద్ధ వికలాంగ మహిళ తమపై అరాచకాలు గురిచేస్తున్న తన పెద్ద కుమారుడు రెండు ఏళ్ల నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం జరిగిందని అప్పటినుండి తన పెద్ద కుమారుని కుమారులు వరుసకు సొంత మనుమళ్లు రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి లు తన పేరుపై ఉన్న పట్టా భూమి ఐదు ఎకరాలతో పాటు ఉమ్మడి ఇల్లును కూడా అక్రమంగా వారిని వారి పేరు మీద మార్చుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బ్యాంక్ ఎకౌంట్, ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్కులు కూడా తమ వద్ద నుండి బలవంతంగా లాక్కొని తమ పేరు మీద వ్రాయించుకున్నారని ఇదేంటి అని అడిగితే ఎక్కువగా మాట్లాడవద్దు అతిగా ప్రవర్తిస్తే పెట్రోలు పోసి తగిలేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని వృద్ధురాలు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనతో పాటు వచ్చిన తన కూతురు మనమరాళ్లు కు మీడియా వివరణ అడిగితే ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారని తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆర్డిఓ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వృద్ధురాలు పేరుమీద ఉన్న భూమిని ఆమెకే చెందే విధంగా చూడాలని ఆదేశించడం జరిగిందని వారు తెలిపారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >