Posted on 2025-09-23 12:02:31
బీసీలకు 42%, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు!
జీవో విడుదల చేయనున్న ప్రభుత్వం
తర్వాత జిల్లాలవారీగా జాబితా ప్రకటన
డైలీ భారత్, హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.
బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెకల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జిల్లాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లు 31 జడ్పీ, 565 జడ్పీటీసీ, 5,763 ఎంపీటీసీ, 12,760 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీచేసిన వెంటనే కలెక్టర్లు జిల్లా స్థాయిలో రిజర్వేషన్లను వెల్లడించనున్నట్టు సమాచారం.
హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్లో ఎన్నికలు ముగించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలోని 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీ స్థానాలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 565 మండల పరిషత్, 31 జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. ఆదివారం కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు మంగళవారం సాయంత్రంలోగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >