Posted on 2025-11-21 09:11:10
యశోద హాస్పిటల్ వైద్యులు డా. బర్గోహైన్ వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పార్కిన్సన్ వ్యాధిని తొలి దశలో మందుల ద్వారా నయం చేయవచ్చని వ్యాధి ముదిరితే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అనే శస్త్ర చికిత్స ద్వారా నియంత్రించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డా.బర్గోహైన్ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ డి బి ఎస్ ద్వారా రోగుల జీవితం మెరుగుపడుతుందన్నారు. పార్కిన్సన్ వ్యాధి అనేది ఒక ప్రగతిశీల మెదడు వ్యాధి అని ఇది లక్షలాదిమందిని ప్రభావితం చేస్తుందన్నారు. భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి యొక్క వ్యాప్తి ప్రతి లక్ష జనాభాకు 15 నుండి 43 కేసుల మధ్య ఉంటుందని అంచనా వేశారు. జీవన దీర్ఘత్వం పెరుగుతుండడంతో పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్నారు.డి బి ఎస్ ద్వారా దిర్గకాలిక వ్యాధులైన రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులను అరికట్ట వచ్చాన్నారు. డిబిఎస్ మెదడులో రెండు వైపులా చికిత్స చేయగలదని, ఇది రెండు అవయవాలపై ప్రభావం చూపే రోగులకు లాభదాయాకమన్నారు. ఈ సమావేశంలో వైద్యులు ప్రసాద్,రుక్మిణి లు పాల్గొన్నారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >