Posted on 2025-12-12 21:45:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఒక మహిళపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయి సాయినాథ్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ ప్రత్యేక మహిళ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి డి. దుర్గా ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వేషన్ దగ్గర నివాసముండే సాయినాథ్ కు పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం ఉండేవాడు.అతని మరదలుపై కన్నుపడింది. ఆమెను ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని మనసులో అనుకుని, ఆమె పని చేస్తున్న ప్రదేశంలోకి 29 నవంబర్, 2019 న బైక్ పైన తీసుకెళ్లి భూమారెడ్డి కన్వేషన్ దగ్గర ఉన్న తన ఇంటిలోకి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడనే నేర అభియోగాలు రుజువు అయినట్లు నిర్దారణ కావడంతో సాయినాథ్ కు అత్యాచారం నేరంకుగాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. జైలిశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >