Posted on 2026-01-14 17:43:41
సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి,
మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు కూడా అమలు చేయాలి
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
డైలీ భారత్, వైరా: వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించి, పూర్తి స్థాయిలో అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సమావేశం స్థానిక పార్టీ కార్యాలయం
బోడెపూడి భవనంలో డివిజన్ కమిటీ సభ్యురాలు కొండబోయిన ఉమావతి అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కోరారు. పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న పేదలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి అవకాశాలు లేక పట్టణ పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. వైరా నియోజకవర్గ సిపిఎం శ్రేణులు ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేసి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ, సుంకర సుధాకర్, కొండబోయిన నాగేశ్వరరావు, డివిజన్ నాయకులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, కె. నరేంద్ర, తోట నాగేశ్వరావు, ఏర్పుల రాములు, బాదావత్ శ్రీనివాస్, బోయినపల్లి శ్రీనివాసరావు, మాంగంటి తిరుమలరావు, తూము సుధాకర్, వజ్జా రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >