Posted on 2026-01-30 20:34:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అభ్యర్థి నోడ్యూ సర్టిఫికెట్ కచ్చితంగా పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆస్తిపన్ను పూర్తిగా చెల్లించినట్లు ధ్రువపత్రాన్ని అందజేస్తారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో ఓ అభ్యర్థి ఏకంగా రూ. 7.42 కోట్లకు పైగా మున్సిపల్ పన్ను బకాయిలు చెల్లించారు. అనంతరం నేడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం నగరంలోని తీవ్ర చర్చనీయాశంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్కు పోటీచేసే అభ్యర్థులు వందల్లో ఉండడంతో మున్సిపల్ కార్యాలయానికి గత మూడు రోజులుగా వరుస కట్టారు. పలువురు ఆశావహులు నోడ్యూ సర్టిఫికెట్ పొందేందుకు బారులు తీరారు. ఇన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలు ఎన్నికల నిబంధనల కారణంగా క్లియర్ అవుతున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పన్ను సైతం తప్పనిసరిగా కట్టాల్సి వస్తుండడంతో అభ్యర్థులు సైతం ఏం చేయలేక బకాయిలు కట్టే పనిలో పడ్డారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >