Posted on 2026-02-26 17:34:26
నూతన సభ్యులను ఘనంగా సత్కరించిన ఎర్రం విజయ్ గుప్తా
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా క్రెడాయ్ నూతన కార్యవర్గ ఎన్నికలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. జిల్లా రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా నూతన నాయకత్వం బాధ్యతలను స్వీకరించింది.
ఎన్నికైన నూతన బాధ్యులు:
అధ్యక్షుడు: కొత్తింటి శ్రీనివాస్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి: లడ్డూరి శ్రీనివాస్ యాదవ్
ఉపాధ్యక్షుడు: మహమ్మద్ జమీల్ అహ్మద్
కోశాధికారి: కోవూరు బాలరాజ్
ఘన సన్మానం:
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ప్రముఖ యువ వ్యాపారవేత్త ఎర్రం విజయ్ గుప్తా ఘనంగా సన్మానం చేశారు. బాధ్యతలు చేపట్టిన అధ్యక్ష, కార్యదర్శులను స్వయంగా కలిసి, వారికి శాలువాలు కప్పి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎర్రం విజయ్ గుప్తా మాట్లాడుతూ.. కామారెడ్డి అభివృద్ధిలో క్రెడాయ్ పాత్ర కీలకమైనదని, నూతన కార్యవర్గం నేతృత్వంలో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కామారెడ్డి రియల్ ఎస్టేట్ రంగం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మరియు వ్యాపారవేత్తలు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >