| Daily భారత్
Logo




సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

News

Posted on 2026-02-28 21:44:48

Share: Share


సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్

డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు  ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిరిసిల్ల యందు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్  నిర్వహించడం జరిగింది. 

ఇట్టి కార్యక్రమానికి 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా వచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్  ను పరిచయం చేశారు. అనంతరం కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా నూతన ఆలోచనలను, ప్రశ్నించడం ద్వారా శాస్త్రీయ ఆలోచన పెంపొందుతుందని తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ చకినాల శ్రీనివాస్ మాట్లాడుతూ, విజ్ఞాన శాస్త్రం మానవ అభివృద్ధికి మూలం అని ఈరోజు మనం పొందుతున్న అధునాతన టెక్నాలజీ పూర్తిగా సైన్స్ అభివృద్ధి ఫలాలు అని తెలిపారు.  మూఢనమ్మకాలు నమ్మవద్దని ఏదైనా శాస్త్రీయంగా పరిశీలించి నిజనిర్ధారణ చేయాలని తెలియజేశారు. బయట దొరికే ఆహార పదార్థాలు, వాటి వల్ల జరిగే నష్టాలు ముఖ్యంగా శీతల పానీయాల వల్ల మన శరీరాన్ని అది ఎంత కృంగదీస్తుందో సవివరంగా తెలియజేశారు. ఎగ్జిబిట్స్ తయారీలో పిల్లలు ఎలా కష్టపడ్డారో తెలియజేస్తూ, పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు తూముల తిరుపతి మరియు రాజగోపాల్ రెడ్డి కృషిని అభినందించారు. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న శాస్త్రీయ అభివృద్ధి, చంద్రయాన్ 2 విజయవంతం కావడంలో శాస్త్రజ్ఞుల కృషిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు. 

ఈ  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బైరి రవీందర్,T తిరుపతి, వడాల రవీందర్, రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ , రాజేశం , డేవిడ్సన్ , రమాదేవి, రాధిక, నిరోషా , విజయలక్ష్మి  ,  CRP దేవేందర్ , అనిల్, రాజు,పాల్గొన్నారు.

Image 1

హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-18 18:24:01

Readmore >
Image 1

నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్

Posted On 2026-06-18 18:21:32

Readmore >
Image 1

రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-06-18 17:26:43

Readmore >
Image 1

ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే తొలగించాలి

Posted On 2026-06-18 17:16:48

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డ తండ్రికి 04 సం. జైలు శిక్ష

Posted On 2026-06-18 17:15:26

Readmore >
Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >