Posted on 2026-03-02 16:16:42
నిజామాబాద్లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు సీపీ పి. సాయి చైతన్య వెల్లడి
డైలీ భారత్, నిజామాబాద్: గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పౌరుల సహాయార్థం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సకాలంలో సమాచారం అందించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల సౌకర్యార్థం న్యూఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ప్రారంభించింది. అక్కడి అధికారులతో సమన్వయం చేస్తూ నిజామాబాద్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి భద్రత, స్థితిగతులపై సమాచారం పొందడానికి కుటుంబ సభ్యులు వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు.
సంప్రదించవలసిన నంబర్లు:
📞 నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్: 8712659700
📞 సర్కిల్ ఇన్స్పెక్టర్: 8712659821
ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారం కోసం మాత్రమే ఈ నంబర్లను సంప్రదించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >