Posted on 2026-03-02 20:46:42
నిజామాబాద్లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు సీపీ పి. సాయి చైతన్య వెల్లడి
డైలీ భారత్, నిజామాబాద్: గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పౌరుల సహాయార్థం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సకాలంలో సమాచారం అందించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల సౌకర్యార్థం న్యూఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ప్రారంభించింది. అక్కడి అధికారులతో సమన్వయం చేస్తూ నిజామాబాద్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి భద్రత, స్థితిగతులపై సమాచారం పొందడానికి కుటుంబ సభ్యులు వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు.
సంప్రదించవలసిన నంబర్లు:
📞 నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్: 8712659700
📞 సర్కిల్ ఇన్స్పెక్టర్: 8712659821
ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారం కోసం మాత్రమే ఈ నంబర్లను సంప్రదించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >