Posted on 2026-03-16 20:34:27
చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కి ఫిర్యాదు
కొత్తగూడెం ఇమంది ఉదయ్ కుమార్.
డైలీ భారత్, భద్రాద్రి, కొత్తగూడెం: కొత్తగూడెం మరియు పాల్వంచ కార్పొరేషన్ పరిధిలో ఇష్టానుసారం ప్రభుత్వ ఆదేశాలను బేకాతరు చేస్తూ
రోడ్ల పక్కన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ వేసిన అక్రమ హోర్డింగ్ లను ప్రకటన బోర్డులను వెంటనే తొలగించాలని ప్రజల ప్రాణాలకు ఇబ్బంది హాని జరగకుండా చూడాలని కొత్తగూడెం కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇమంది ఉదయ్ కుమార్ ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్ను వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే ప్రకటన బోర్డులను అన్నిటిని తొలగించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇమంది ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకటన బోర్డులు పెట్టరాదని గతంలోనే 2020 జూలై 4వ తేదీన తెలంగాణ మున్సిపల్ శాఖ జీవోను జారీ చేసిందని తెలిపారు. ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రకటన బోర్డులకు అనుమతి ఇవ్వరాదని గతంలోనే ఇచ్చిన ప్రకటన బోర్డులకు అనుమతి పొడిగించరాదని స్పష్టంగా తెలిపారు.కానీ మున్సిపల్ అథారిటీ ఆదేశాలను తుంగలో తొక్కి ఇప్పటికే పాల్వంచలో దాదాపు మూడేళ్ల నుంచి బోర్డులకు అనధికార అనుమతులు ఇస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో సైతం ఎట్టి అనుమతులు లేకుండా బోర్డులు ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తూ మున్సిపల్ శాఖ నిబంధనలను అధికారులు తుంగలో తొక్కారు. దీనిపై రెండు వారాల క్రితమే కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు లేకపోవడంతో మరల 16వ తేదీ సోమవారం నాడు కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కమిషనర్ను ఆదేశించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >