| Daily భారత్
Logo




FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు

News

Posted on 2026-04-01 09:56:39

Share: Share


FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నేషనల్ హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు ఒక ముఖ్యమైన వార్త. మీరు మీ కారుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) వాడుతున్నారా? అయితే ఇకపై మీ జేబుకు కొంచెం అదనపు భారం పడక తప్పదు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టోల్ టాక్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ పాస్‌లను వాడుతున్న లక్షలాది మంది ప్రైవేట్ వాహన యజమానులపై ఈ ప్రభావం పడనుంది.

ప్రస్తుతం ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర 3000 రూపాయలుగా ఉంది. కానీ, 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీని ధర 3,075 రూపాయలకు పెరగనుంది. అంటే నేరుగా 75 రూపాయల ధర పెరిగిందన్నమాట. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. 2025 ఆగస్టు 15న ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రైవేట్ వాహన యజమానులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం దాదాపు 56 లక్షల వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఈ పాస్ ద్వారా టోల్ చెల్లింపులు చేస్తున్నాయి.

అయితే కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి కాబట్టి, వాహనదారులకు ఇప్పటికీ కొంత డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉంది. మీ పాస్ రినవల్ దగ్గరకు వచ్చినా లేదా మీరు కొత్తగా పాస్ తీసుకోవాలని అనుకుంటున్నా.. మార్చి 31వ తేదీ రాత్రి 11:59 గంటల లోపు పాత ధరకే అంటే 3,000 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఒక్కో పాస్‌పై మీరు నేరుగా 75 రూపాయలు ఆదా చేసుకోవచ్చు.ఈ పాస్‌ను మీరు ఇంటి నుండే ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ లేదా ‘రాజమార్గ యాత్ర’ యాప్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. వెబ్‌సైట్ ద్వారా తీసుకోవాలనుకుంటే.. ముందుగా ఎన్‌హెచ్‌ఏఐ సైట్‌లోకి వెళ్లి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. అక్కడ మెనూలో ఉన్న ‘ ఫస్ట్ట్యాగ్ ఆన్యూల్ పాస్’ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ వాహనం, ఫాస్టాగ్ వివరాలను నమోదు చేయాలి. మీ అర్హతను ధృవీకరించిన తర్వాత ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తే సరిపోతుంది.యాప్ ద్వారా అయితే, మీ స్మార్ట్‌ఫోన్‌లో రాజమార్గ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. మీ ఫాస్టాగ్ ఖాతాను యాప్‌కు లింక్ చేసిన తర్వాత, యాన్యువల్ పాస్ సెక్షన్‌లోకి వెళ్లి మీ వాహనాన్ని ఎంచుకుని ఫీజు చెల్లించాలి. పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మీ పాస్ యాక్టివేట్ అవుతుంది.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >