Posted on 2026-04-01 14:55:54
జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి.
ఉపాధిహామీ పనులు, కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, తాగు నీటి వసతి ఏర్పాటు చేయాలి.
వేసవి వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : వేసవి వడగాలుల నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేసవి వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ, అగ్ని మాపక శాఖ, అటవీ శాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ వివిధ శాఖల ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ...
ఈ వేసవి కాలంలో వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆశ కార్యకర్త నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఏమైనా మరమ్మత్తు ఉంటే ముందస్తుగానే చేయించాలని ఆదేశించారు. మున్సిపల్, తహసీల్ కార్యాలయాలు, బస్టాండ్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రతి రోజు నీరు త్రాగడం, గొడుగు తీసుకుని బయటికి రావడం, వేడి గాల్పులు వచ్చే సమయంలో ఇంట్లో ఉండటం వంటి వివిధ అంశాలను ప్రజలకు తెలియజే యాలన్నారు. ఉపాధిహామీ పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు, ఓఆర్ఎస్ పాకెట్లు, నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. మూగ జీవాల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని, అన్ని గ్రామాల్లో నీటి తొట్ల నిర్వహణ పక్కాగా ఉండేలా చూడాలని, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలపై పశు వైద్య, సంవర్ధక శాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వాటి సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, వైద్యాధికారి రజిత, వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, డీఆర్డీఓ గీత, మిషన్ భగీరథ అధికారులు అన్వర్, సుమలత, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, కార్మిక శాఖ అధికారి నజీర్, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసాచారి, పశు సంవర్ధక శాఖా అధికారి రవీందర్ రెడ్డి, మత్స్య శాఖ అధికారి సౌజన్య, జిల్లా రవాణాశాఖా అధికారి లక్ష్మణ్ కుమార్, పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్ఐఆర్ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >