| Daily భారత్
Logo




సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

News

Posted on 2026-04-10 17:47:45

Share: Share


సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

డైలీ భారత్, వరంగల్: శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్ల సంబంధించిన బ్యాటరీలను చోరీలకు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురిని హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు సుమారు 1లక్ష 98వేల రూపాయల విలువ గల 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2లక్షల 60వేల రూపాయల నగదు, రెండు ట్రాలీలు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులందరు నల్గోండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేష్ (27), బొంగరాల సుధాకర్ (30), తన్నీరు శివాజీ (26), బీమనబోయిన నరసింహ (31), గడగోజు సురేష్ (25)లు గుర్తించడం జరిగింది.

ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులకు పట్టుబడిన నిందితుల్లో ప్రధాన నిందితుడైన గణేష్ (డ్రైవర్) మిగితా మిగితా ఇద్దరు నిందితులైన  సుధాకర్, శివాజీలకు జనరేటర్ మరమ్మత్తులు, సెల్ టవర్ పనులకు పరిజ్ఞానం కలిగి వుండటంతో  ముఠాగా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే అలోచనతో సెల్ టవర్లపై పరిజ్ఞానం కలిగి వుండటంతో సెల్ టవర్లకు వినియోగించే బ్యాటరీల్లోని కొన్నింటి తప్పించడం ద్వారా సెల్ టవర్ పనతీరులో ఎలాంటి సమస్యలు రావని గుర్తించిన నిందితులు సెల్ టవర్ బ్యాటరీలను చోరీలు చేసేందుకుగా సిద్దపడి ఈ ముగ్గురు నిందితులు సెల్ టవర్‌లోని బ్యాటరీలను చోరీ చేసి మహరాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో విక్రయించి వచ్చిన డబ్బుతో  ముగ్గురు నిందితులు జల్సాలు చేసేవారు. ఇదే సమయంలో రాత్రి సమయాల్లో చెరువుల్లో చేపలను చోరీలకు పాల్పడే మిగితా ముఠా సభ్యులు సైతం కలవడంతో, ఈ ముఠా సభ్యులు చేపలు చోరీలకు పాల్పడే సమయంలోనే బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుకూలంగా వున్న సెల్ టవర్లను గుర్తించిన సెల్ టవర్లలోని బ్యాటరీలను చోరీలకు పాల్పడేవారు. అలాగే చెరువుల్లో చోరీ చేసిన చేపలను నల్గోండ లో తక్కువ ధర విక్రయించేవారు. ఈ తరహలో నిందితులు వరంగల్ కమిషనరేట్, యాదాద్రి,నల్గోండ, సూర్యపేట జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 13 సెల్ టవర్ బ్యాటరీ చోరీలకు పాల్పడ్డారు. గత నెల మార్చ్ 3వ తారీకున హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ ప్రాంతంలోని సెల్ టవర్ నుండి 48 బ్యాటరీలకు చోరీకు గురికావడంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హసన్‌పర్తి పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాపు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని ముఠా సభ్యులను గుర్తించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. పక్కా సమచారంతో ఈ రోజు తెల్లవారుజామున నిందితులు చోరీ సొత్తును అమ్మేందుకు హసన్‌పర్తి మండలం, దేవన్నపేట గ్రామ శివారు ప్రాంతంలోని అవుటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద వేచి వున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను హసన్ పర్తి పోలీసులు అరెస్టు చేసారు. నిందితులు ఇచ్చిన సమచారంతో పోలీసులు చోరీ సోత్తు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత, కాజీపేట ఏసిపి ప్రశాంత్ రెడ్డి, హసన్‌పర్తి ఇన్స్‌స్పెక్టర్ చేరాలు, యస్ ఐ లు దేవేందర్, సుజిత్ రెడ్డి, కానిస్టేబుళ్ళు క్రాంతి కుమార్, బావు సింగ్, వెంకట స్వామి, భరత్ తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >