Posted on 2026-04-11 22:48:59
జీజీహెచ్ లో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ వారోత్సవాల్లో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి శనివారం ప్రారంభించారు. అలాగే డెడికేటెడ్ సెమీ ఐసీయూ వార్డును ప్రారంభించి.. అక్కడ అందించే సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ లో ప్రారంభించామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. డ్రగ్స్ తో కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, ఆర్ ఎంఓ డాక్టర్ సంతోష్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, ఆర్ అండ్ బీ అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >