| Daily భారత్
Logo




ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

News

Posted on 2026-04-22 19:28:48

Share: Share


ఆర్టీసీ కార్మికుల సమ్మె – శాంతియుతంగా నిర్వహించాలి

ప్రజా అశాంతికి కారణమైతే కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చట్టం మరియు శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యమని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు. సమ్మె అనేది ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ, అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల రోజువారీ జీవనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

జిల్లా ఎస్పీ ముఖ్య సూచనలు:

సమ్మె కారణంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బందులు పడకుండా రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టబడింది.

ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా లేదా ఆర్టీసీ సిబ్బంది తిరిగి డ్యూటీలో చేరినా వారికి పూర్తి స్థాయి పోలీస్ రక్షణ కల్పించబడుతుంది. అదెవిధముగ విధులకు హజరు అయ్యె వవారిని రాకుండా భయభ్రాంతులకు గురిచేసిన వారిపై 100% చట్టపరమైన కేసులు నమోదు చేయబడుతాయి

బస్సుల రాకపోకలు జరిగే ప్రాంతాలు, డిపోలు, ముఖ్య కూడళ్లు మరియు బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు, నిరంతర పొలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేయబడింది.

ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడమె కాకుండ వారిపై శాఖ పరమైన చర్యల గురించి రిపోర్టులు పంపబడును.  

ఈరోజు కామారెడ్డి బస్టాండ్ యందు నిలిచి ఉన్న బస్సు టైరు నుండి గాలి తీసివేసి ప్రభుత్వ ఆస్తికి నష్టపరిచి ప్రజా రవాణాకు భంగం కలిగించినారు.  ఇట్టి సంఘటనలో పాల్గొన్న వారిపై ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం మరియు పోలీసు విధులను ఆటంకపరిచిన నేరాల కింద ఇప్పటికే కేసులు  నమోదు చేయబడినవి. శాఖ పరమైన చర్యల గురించి రిపోర్టులు పంపబడును. 

ఇకపై కూడా ఎవరైనా అశాంతియుత పద్ధతులలో నిరసనలు తెలియజేస్తే వారిపై కచ్చితంగా కేసులు నమోదు చేయబడతాయి.

కామారెడ్డి జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా శాంతియుత వాతావరణం కాపాడుట కొరకు ముమ్మర పెట్రోలింగ్, పోలీస్ పికెట్స్ మరియు పెట్రోలింగ్, CCTV నిఘా  ఏర్పాటు చేయడం జరిగింది.జిల్లా ప్రజలు, ఉద్యొగులు  పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100 కి  సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు. 


Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >