Posted on 2026-04-27 08:03:32
విశాఖపట్నంలో విషాద ఘటన
డైలీ భారత్, విశాఖపట్నం: నగరంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఎండాడ ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమ వ్యవహారంలో మోసపోయి తీవ్ర మనస్థాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం… ఎండాడ రాజీవ్నగర్లో నివాసం ఉంటున్న భాస్కర్రావు కుమార్తె సంధ్య కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఇటీవల అతడు మోసం చేయడంతో ఆమె తీవ్ర నిరాశకు లోనైంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >