Posted on 2026-04-27 15:26:03
డైలీ భారత్, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా షీ టీమ్ బృందం జిల్లా కేంద్రంలో గల ప్రతిభ జూనియర్ కళాశాల, లక్ష్మి పారామెడికల్ కాలేజ్, అంగని వాడి సెంటర్స్ నందు విద్యార్థులకు, పిల్లలకు, మహిళలకు వివిధ అంశాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం బృందం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందిన గుర్తి కొత్త తరహాలో మోసాలు జరుగుతున్నాయని విద్యార్థులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని డ్రగ్స్ ను నిర్మూలించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని సంబంధించిన సమాచారాన్ని డయల్ 100 కు లేదా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు, మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిర్మూలన, సోషల్ మీడియా దుష్ప్రభావాలు మొదలగు అంశాల గురించి వివరించారు. మహిళలు విద్యార్థులు వేధింపులకు గురి అయినట్లయితే 100కు సమాచారం ఇవ్వాలని, పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన హింసకు గురి చేసిన 1098 కి సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >