| Daily భారత్
Logo




డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం

News

Posted on 2026-04-27 18:56:03

Share: Share


డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం

డైలీ భారత్, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా షీ టీమ్ బృందం జిల్లా కేంద్రంలో గల ప్రతిభ జూనియర్ కళాశాల, లక్ష్మి పారామెడికల్ కాలేజ్, అంగని వాడి సెంటర్స్ నందు విద్యార్థులకు, పిల్లలకు, మహిళలకు వివిధ అంశాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం బృందం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందిన గుర్తి కొత్త తరహాలో మోసాలు జరుగుతున్నాయని విద్యార్థులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని డ్రగ్స్ ను  నిర్మూలించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని సంబంధించిన సమాచారాన్ని డయల్ 100 కు లేదా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు, మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిర్మూలన, సోషల్ మీడియా దుష్ప్రభావాలు మొదలగు అంశాల గురించి వివరించారు. మహిళలు విద్యార్థులు వేధింపులకు గురి అయినట్లయితే 100కు సమాచారం ఇవ్వాలని, పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన హింసకు గురి చేసిన 1098 కి సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >