Posted on 2026-04-27 18:56:03
డైలీ భారత్, సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా షీ టీమ్ బృందం జిల్లా కేంద్రంలో గల ప్రతిభ జూనియర్ కళాశాల, లక్ష్మి పారామెడికల్ కాలేజ్, అంగని వాడి సెంటర్స్ నందు విద్యార్థులకు, పిల్లలకు, మహిళలకు వివిధ అంశాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం బృందం మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందిన గుర్తి కొత్త తరహాలో మోసాలు జరుగుతున్నాయని విద్యార్థులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని డ్రగ్స్ ను నిర్మూలించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని సంబంధించిన సమాచారాన్ని డయల్ 100 కు లేదా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహాలు, మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల నిర్మూలన, సోషల్ మీడియా దుష్ప్రభావాలు మొదలగు అంశాల గురించి వివరించారు. మహిళలు విద్యార్థులు వేధింపులకు గురి అయినట్లయితే 100కు సమాచారం ఇవ్వాలని, పిల్లల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన హింసకు గురి చేసిన 1098 కి సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్
Posted On 2026-04-27 19:01:31
Readmore >
డ్రగ్స్ నిర్మూలన, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీం బృందం
Posted On 2026-04-27 18:56:03
Readmore >
తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల... తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు
Posted On 2026-04-27 18:50:27
Readmore >
ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
Posted On 2026-04-27 18:49:15
Readmore >
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు
Posted On 2026-04-27 18:47:54
Readmore >
కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Posted On 2026-04-27 18:46:32
Readmore >