Posted on 2026-04-29 08:29:53
డైలీ భారత్, హుస్నాబాద్ : పర్యాటక రంగంలో సరికొత్త అనుభూతిని పంచేందుకు హుస్నాబాద్ సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు వద్ద అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న రాష్ట్రంలోనే మొట్టమొదటి గాజు వంతెన (Glass Bridge) తుది మెరుగులు దిద్దుకుంటోంది.
పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించేలా, చెరువు సుందరీకరణ కోసం ప్రభుత్వం మొత్తం రూ. 18 కోట్ల భారీ వ్యయంతో పనులు చేపట్టింది.
ప్రేమ చిహ్నం.. ప్రకృతి పరవశం!
ఈ గాజు వంతెనను పర్యాటకులను ఆకర్షించేలా అత్యంత అందమైన "లవ్ సింబల్" (హృదయాకారం) ఆకారంలో నిర్మిస్తుండటం విశేషం. సుమారు 150 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో రూపొందుతున్న ఈ వంతెనపై నడుస్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. పారదర్శకమైన గాజు గుండా కింద ఉన్న నీటిని వీక్షిస్తూ.. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించే వీలుండటంతో పర్యాటకులు సరికొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనుభూతి చెందుతారు.
సకల హంగులతో సుందరీకరణ
సిద్దిపేటలోని కోమటి చెరువు తరహాలోనే ఎల్లమ్మ చెరువును తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెనలో అత్యంత దృఢమైన, నాణ్యమైన గాజు పలకలను అమర్చారు. చెరువు కట్ట సుందరీకరణతో పాటు రాత్రి వేళల్లో విద్యుత్ వెలుగులు జిగేల్మనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాకింగ్ ట్రాక్, పర్యాటకులు సేదదీరేందుకు గార్డెన్లు, ఫోటో పాయింట్లు సిద్ధమవుతున్నాయి."
నెలలోపు గాజు బ్రిడ్జి పనులు పూర్తి : కమిషనర్
ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ గ్లాస్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. మరో 15 రోజుల నుంచి నెల రోజుల లోపు పనులన్నీ పూర్తి చేసి, పర్యాటకులకు ఈ అద్భుతమైన గాజు వంతెనను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో ఈ వంతెన ప్రారంభమైతే, హుస్నాబాద్ ప్రాంతం రాష్ట్ర పర్యాటక మ్యాప్లో ప్రత్యేక గుర్తింపు పొందడం ఖాయం.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >