Posted on 2026-05-27 16:58:02
డైలీ భారత్, ఖమ్మం: పోలీసు వాహనాల నిర్వహణను మెరుగుపరచడానికి, మరమ్మతులను వేగవంతం చేయడానికి యంటి సెక్షన్ వర్క్ షాప్లో ఏర్పాటు చేసిన
హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు.
పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం రోడ్లపై తిరగడం వల్ల వచ్చే వాహన మరమ్మతుల కోసం మెకానిక్ వర్క్ షాప్ లలో గంటల తరబడి కాకుండా నిమిషాల్లో సిద్ధమయ్యే విధంగా వెహికల్ లిఫ్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. దీనివల్ల పోలీస్ శాఖ వాహనాల జీవితకాలం పెరగడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏఆర్ ఏసీపీ లు సుశీల్ సింగ్, నర్సయ్య, ఆర్ ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగుల్ మీరా పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >