Posted on 2026-06-05 21:27:15
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సుజాతనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
టేకులపల్లి మండలం నుండి సుజాతనగర్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న అశోక్ లేలాండ్ మినీ ట్రక్కును (నెంబర్: TG29T1053) సుజాతనగర్ పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా, పశువులను అత్యంత క్రూరంగా కట్టేసి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.
రెండు ఆవు దూడలు, రెండు కోడి దూడలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ మినీ ట్రక్కును సీజ్ చేశారు.
బత్తుల శ్రీను, మాదాసు శ్రీను ,నిందితులు టేకులపల్లి ప్రాంతంలో మధ్యవర్తి సేవ్య సహాయంతో పశువులను తక్కువ ధరకు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా, కోదాడ సంతలో ఎక్కువ ధరకు విక్రయించడానికి అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారని సుజాతనగర్ ఎస్సై రమాదేవి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >