Posted on 2026-06-19 19:17:58
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రధాన కూడలిలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన సందర్భంగా స్కూల్ బస్సులపై విస్తృత తనిఖీలు చేపట్టిన రవాణా శాఖ అధికారులు, విద్యార్థులకు అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు వాహనాల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాల (ఫైర్ ఎక్స్టింగ్విషర్) వినియోగ విధానం, అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా బయటకు వెళ్లే పద్ధతులపై ప్రత్యక్షంగా ప్రదర్శన నిర్వహించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతోనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగాన్ని ప్రదర్శింపజేసి అవగాహన కల్పించారు. రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్, మోటారు వాహనాల తనిఖీ అధికారి గంధం వంశీధర్, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ, ఫైర్ సబ్ ఇన్స్పెక్టర్ నర్మెట నరేందర్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. "విద్యార్థుల భద్రతే లక్ష్యంగా స్కూల్ బస్సుల తనిఖీలు, ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి" అని జిల్లా రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >