| Daily భారత్
Logo




ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

News

Posted on 2026-06-23 11:09:19

Share: Share


ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్-2026 కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, నగరం నలుమూలల నుంచి ఒలింపిక్ జ్యోతిని తీసుకువచ్చిన ప్రతి క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో ఒలింపిక్ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఒలింపిక్ డే రన్ కేవలం క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. క్రమశిక్షణతో కూడిన క్రీడాకారులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని, మిలిటరీ సైనికులకు ఉన్నంత క్రమశిక్షణ క్రీడాకారులకు కూడా ఉండాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల్లో క్రీడలకు అపూర్వ ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని మంత్రి తెలిపారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ రెండు ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒలింపిక్ డే అందించే క్రీడా స్ఫూర్తిని మరింత విస్తృతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Image 1

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

Posted On 2026-06-23 12:14:31

Readmore >
Image 1

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

Posted On 2026-06-23 11:59:52

Readmore >
Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >