Posted on 2024-02-26 13:35:21
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని బి ఆర్ఎస్ పాలనలో ప్రజలను వేధించిన నాయకులకు తగిన బుద్ధి చెబుతామని, కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే బిఆర్ఎస్ నాయకులు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని కొందరు బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు పథకాలు అమలు చేశామని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మంగళవారం రోజున మరో రెండు పథకాలు గృహ జ్యోతి, గృహలక్ష్మి అమలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో సబ్బండా వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్,నెరల్లా నరసింగం,లింగాల భూపతి,గుగ్గుళ్ల శ్రీకాంత్,పొన్నాల పరుశురాం,ఎగుర్ల ప్రశాంత్,మోర లక్ష్మిరాజం,ఆసాని సత్యనారాయణ రెడ్డి,సామల గణేష్,బాలసాని శ్రీనివస్,మచ్చ శ్రీను,బండి పరుశురాం,గోగు తిరుపతి,కొల శంకర్,యండి సలీం,అలువాల మల్లేశం తదితరులున్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >