Posted on 2024-02-26 14:22:36
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో :తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా టియుడబ్ల్యూజీ (ఐజేయు) జాతీయ అధ్యక్షులు, సీనియర్ సంపాదకుడు కే శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వడంతో సంపూర్ణ న్యాయం జరుగుతుందని జర్నలిస్టు సమాజం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. 1996లో ప్రెస్ అకాడమీ ఏర్పడగా మొదటి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆయన మరో మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
విషయం తెలిసిన వెంటనే టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీను) పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గుడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్ రావడం శుభ సూచికం అన్నారు. కె శ్రీనివాస రెడ్డి హయాంలో సంపూర్ణ న్యాయం జరుగుతుందని తెలంగాణ జర్నలిస్టులు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జర్నలిస్టుల స్థితిగతులు మారతాయని ఆకాంక్షించిన జర్నలిస్టులకు అనుకున్న మేర న్యాయం జరగలేదన్నారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ( ఐజేయు )
రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >