| Daily భారత్
Logo




మీడియా అకాడమీ చైర్మన్‌కు అభినందనల తెలిపిన గుడిపల్లి శ్రీనివాస్

News

Posted on 2024-02-26 19:52:36

Share: Share


మీడియా అకాడమీ చైర్మన్‌కు అభినందనల తెలిపిన గుడిపల్లి శ్రీనివాస్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో :తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ గా టియుడబ్ల్యూజీ (ఐజేయు) జాతీయ అధ్యక్షులు, సీనియర్‌ సంపాదకుడు కే శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల హక్కులు సంక్షేమం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్‌ పదవి ఇవ్వడంతో సంపూర్ణ న్యాయం జరుగుతుందని జర్నలిస్టు సమాజం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. 1996లో ప్రెస్‌ అకాడమీ ఏర్పడగా మొదటి చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించిన ఆయన మరో మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

విషయం తెలిసిన వెంటనే టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి  గుడిపల్లి శ్రీనివాస్  (పేపర్ శ్రీను) పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా  గుడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తికి మీడియా అకాడమీ చైర్మన్‌ రావడం శుభ సూచికం అన్నారు. కె శ్రీనివాస రెడ్డి హయాంలో సంపూర్ణ న్యాయం జరుగుతుందని తెలంగాణ జర్నలిస్టులు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జర్నలిస్టుల స్థితిగతులు మారతాయని ఆకాంక్షించిన జర్నలిస్టులకు అనుకున్న మేర న్యాయం జరగలేదన్నారు.ఈ కార్యక్రమంలో  టియుడబ్ల్యూజే ( ఐజేయు )  

రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్‌ జర్నలిస్టులు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్‌ కు శుభాకాంక్షలు తెలియజేశారు

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >