Posted on 2024-02-28 11:45:55
ఆర్థికంగా పీడించొద్దు .. మెరుగైన వైద్యాన్ని అందించండి
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో :షాద్ నగర్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారని వారి ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు బుధవారం పట్టణంలోని పరిగి రోడ్డులో ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెండవ బ్లాక్ ను ఎమ్మెల్యే శంకర్ మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక మహిళా కౌన్సిలర్ శ్రావణితో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఏబీవీ ఆసుపత్రి దినదిన ప్రవర్తమానంగా వెలుగొందాలని అన్నారు. పేద ప్రజలను ఎల్లప్పుడూ దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్థికంగా ఎక్కువ ఖర్చు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని పేర్కొన్నారు. మంచి సాంకేతిక పరిజ్ఞానంతో విలువైన వైద్యంతో వారికి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. నేటి సమాజంలో ప్రైవేటు వైద్యం అందనీ ద్రాక్షగా మారుతోందని అందుకే ప్రైవేట్ సంస్థలు పేద ప్రజల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వైద్యం అందించాలని సూచించారు. వ్యవస్థలో ఎవరు ఎన్ని సేవలు చేసిన ఏ రంగాల వారైనా సరే పేదల వైద్యం కోసం ఎప్పుడైనా సిఫార్సు చేస్తారని వారి సిఫార్సులను దృష్టిలో పెట్టుకోవాలని ఆస్పత్రి యాజమాన్యం ఎం.డి డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులకు సూచించారు. వైద్య సేవల్లో మంచిని స్వీకరిస్తామని చెడును స్వీకరించబోమని దానికి అనుగుణంగానే ప్రైవేట్ ఆస్పత్రులు ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. రెండవ బ్లాక్ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్, భార్గవి దంపతులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, శ్యాంసుందర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రావణిలకు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇధ్రీస్, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి కాంగ్రెస్ నేతలు అందే మోహన్ సయ్యద్ ఖదీర్ సింగారం సుదర్శన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >