Posted on 2023-10-26 17:17:09
డైలీ భారత్, శ్రీకాకుళం జిల్లా: చేప ముక్క, యాభై రూపాయల కోసం జరిగిన ఘర్షణలో ఓ నిండు ప్రాణం బలయిపోయింది. వినడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇది నిజం. గొడవ జరగకుండా ఆపడానికి వెళ్లిన పెద్దమనిషి ప్రాణాలపైకి వచ్చిన సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లా, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రెండో వార్డులోని సాయిబుల కోలనీలో మంగళవారం రాత్రి జరిగిన ఓ విచిత్ర సంఘటనలో నిండు ప్రాణం బలయ్యింది. సాయిబుల కాలనీలో పెయింటర్లుగా జీవనం సాగిస్తున్న ఇరువురు వ్యక్తులు కూలి డబ్బులు యాభై రూపాయలతో పాటు చేప ముక్క కోసం మంగళవారం రాత్రి గొడవపడ్డారు. అయితే సయ్యద్ ఖాదర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు గొడవను ఆపే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. గొడవకు దిగిన ఇరువురు మద్యం తాగి ఉండడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఖాదర్ పై ఓ స్టీల్ చెంబుతో షేక్ దాసు అనే వ్యక్తి తల, చాతీపై దాడి చేయడంతో మృత్యువాత పడినట్లు కాశిబుగ్గ పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి ఇన్చార్జి సీఐ రవిప్రసాద్ తన సిబ్బందితో చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే వీరి మధ్య పాత తగాదాలకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >