Posted on 2023-10-30 22:00:46
13000 తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
డైలీ భారత్, సిరిసిల్ల : అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప చిక్కింది. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు జిల్లాలోని విర్ణపెల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన భూక్యా సరిత టిప్పర్ సబ్సిడీ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ కు దరఖాస్తు చేసుకోగా.. అప్లికేషన్ సరితకు అనుకూలంగా పంపడానికి 30 వేల రూపాయల లంచం అడిగారు. 17వేల రూపాయలు ఈనెల 26న తీసుకోగా, సోమవారం మిగతా 13000 సరిత మరిది భూక్య శివకుమార్ వద్ద పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ గితానగర్ లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితున్ని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి వి.వి రమణమూర్తి తెలిపారు. ఏ అధికారైన అవినీతికి పాల్పడితే
9154388954 సంప్రదించాలని కోరారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >