Posted on 2023-10-30 22:05:47
డైలీ భారత్, సిరిసిల్ల: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భాగంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్, సర్థాపూర్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ యస్. శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు వెపన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పెద్దూరు మండల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ రకాల ఆధునిక ఆయుధాలు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములు మరియు వాటి పనితీరుకు సంబంధించిన వివరాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు అందరూ ఎంతో ఆసక్తిగా ఆయుధాల(వెపన్స్) గురించి తెలుసుకున్నారు.సందేహాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎ. జయప్రకాష్ నారాయణ , పార్థసారథి రెడ్డి , అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >