Posted on 2023-11-05 18:15:31
డైలీ భారత్ సిరిసిల్ల :రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన STU రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులుగా మొగలి లక్ష్మణ్
ప్రధాన కార్యదర్శి గా రేవోజు సదానందం
రాష్ట్ర కార్యదర్శిగా చాట్ల మల్లేశం
దీర్ఘకాలికంగా పెండింగ్ లోనున్న ఆర్థిక బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వత రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం సిరిసిల్ల సంఘ కార్యాలయంలో ఎస్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ఎం పర్వత రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో వేతనాలు పెండింగ్ లోనున్న బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణను ప్రముఖ రాజకీయ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కోరారు. అనంతరం నిలిచిపోయిన బదిలీలు పదోన్నతులు ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో నిర్వహించాలని, అల్పాహార పథకంనకు సంబంధించి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మొగిలి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేవోజు సదానందం సంఘ కార్యకలాపములను నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరసింహారెడ్డి, శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి దయానంద్, ఎన్నికల అధికారి పట్నం భూపాల్, రాష్ట్ర కార్యదర్శి చాట్ల మల్లేశం, జిల్లా కార్యదర్శులు, అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 2023 - 25 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండవసారి ఎస్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా మొగిలి లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేవోజు సదానందం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పట్నం భూపాల్ ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >