Posted on 2024-09-06 19:56:48
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి (పొక్సో కేసులో) మూడేళ్ళ జైలు శిక్ష,2000/- రూపాయల జరిమానా..
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మైనర్ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి (పొక్సో కేసులో) మూడేళ్ళ జైలు శిక్షతో పాటుగా 2000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత శుక్రవారం రోజున తీర్పు వెల్లడించారు.
ఇల్లంతకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటికి దగ్గరలో నిందుతుడు చీపెల్లి మల్లయ్య నివాసముండేవాడు. 25/12/ 2018 రోజున బాలిక ఒంటరిగా వుండగా మల్లయ్య ఆ బాలికకు బిస్కెట్స్ ఇస్తానని మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు.మరుసటి రోజు బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పడంతో ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇల్లంతకుంట అప్పటి ఎస్.ఐ చంద్రశేఖర్ నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ప్రాసిక్యూషన్ తరపున పి.పి.పెంట శ్రీనివాస్ వాదించగా,CMS ఎస్.ఐ రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నవీన్,సిఎంఎస్ కానిస్టేబుల్ నరేందర్ లు కోర్టులో 12 మంది సాక్షులను ప్రవేశపెట్టాగా,కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల జిల్లా జడ్జి ( ఇన్చార్జి పొక్సో కోర్టు) ఎన్. ప్రేమలత నిందుతుని మూడు సంవత్సరాలు జైలు శిక్ష,2000/- రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ...
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పైకేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ పెంట శ్రీనివాస్,,CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు, కోర్ట్ కానిస్టేబుల్ లు నవీన్, cms కానిస్టేబుల్ నరేందర్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >