Posted on 2024-09-07 11:49:56
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఓ బాలుడిని ఓ దొంగ దారుణంగా హత్యచేశాడు. దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తిని చూసిన బాలుడు ఎక్కడ అరిచి ఇంట్లో వాళ్లను పిలుస్తాడేమో అన్న భయంతో బాలుడిని బలంగా నేలకేసి కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ పరిధి హాజిపల్లి రోడ్డు సమీపంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. సాయమ్మ, దుర్గయ్య దంపతులకు కుమారుడు కట్టప్ప (6) ఉన్నాడు. అయితే, బాలుడి తండ్రి దుర్గయ్య స్థానికంగా పందులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఎల్లయ్య అనే వ్యక్తి ఆ పందులను దొంగిలించేందుకు దుర్గయ్య ఇంటి వద్దకు వచ్చాడు. అది బాలుడు కట్టప్ప గమనించాడు. అయితే, బాలుడు తనను ఎక్కడ పట్టిస్తాడో అన్న భయంతో ఎల్లయ్య కట్టప్పను నేలకేసి కొట్టి దారుణంగా హత్యచేశాడు. తలకు బలమైన గాయం కావడంతో బాలుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధిత పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >