| Daily భారత్
Logo




ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

News

Posted on 2024-09-14 19:46:32

Share: Share


ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

క్షేత్రస్థాయిలో పరిశీలించి పటిష్ఠ ఏర్పాట్లకు ఆధికారులకు తగు ఆదేశాలు జారీ.

డైలీ భారత్, వరంగల్: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలల  ప్రారంభోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ఆదేశించారు.

శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని పాకాల రోడ్డు లో నూతనంగా నిర్మించిన  నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్ధ నిర్వహణకు ఆధికారులకు పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ... 

నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాలలను ఈనెల 17న ప్రారంభినచనున్నట్లు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర రాజనర్సింహ,  జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రెవిన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల  శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి,  రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి  కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి  శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిధులుగా రానున్నారని తెలిపారు.

50 మంది వైద్య విద్యార్థులకు సరిపడే విధంగా ప్రొఫెసర్లను ఇతర సిబ్బంది నియమించడం జరిగిందని, జిల్లా ఆసుపత్రికి అనుగుణంగా పరికరాలు వైద్యులను నియమించడం దాదాపు పూర్తయిందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఎనిమిది నూతన కళాశాలలు వైద్యశాలలో నర్సంపేట ఆసుపత్రికి కళాశాలకు మాత్రమే అవకాశం వచ్చిందని  ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు.

 జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా మాట్లాడుతూ ప్రారంభోత్సవ ఏర్పాట్లకు నియమించిన అధికారులు  ఎలాంటి లోటుపాట్లు లేకుండా తమకు కేటాయించిన విధులను  అంకితభావంతో నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ఆసుపత్రి  ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే ఇందిరా మహిళ శక్తి కాంటీన్ ను కలెక్టర్, ఎమ్మెల్యే లు పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో కలెక్టర్, ఎమ్మెల్యే లు మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, ఆర్డీవో కృష్ణవేణి, డీసీపీ రవీందర్, డిఎమ్అండ్ హెచ్ఓ వెంకటరమణ, ఎన్పిడిసిఎల్  ఎస్ఈ మధుసూదనరావు, జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా అధికారులు, డాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు,  పోలీసు,  ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >