| Daily భారత్
Logo




తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... మయోనైజ్ పదార్థంపై ఏడాది పాటు నిషేధం

News

Posted on 2024-10-30 23:57:23

Share: Share


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... మయోనైజ్ పదార్థంపై ఏడాది పాటు నిషేధం

మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం

నేటి నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడి

గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేసే మయోనైజ్

మయోనైజ్ తినడంతో అనారోగ్యం పాలవుతున్న ఘటనలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించింది. మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై ఒక సంవత్సరం నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది అక్టోబర్ 30, 2024 నేటి నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది.మయోనైజ్‌పై అధికారులతో మంత్రి సమీక్ష మంత్రి దామోదర రాజనర్సింహ బుదవారం ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మయోనైజ్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రానికి నిషేధానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కల్తీ ఆహారం తీసుకొని పలువురు అనారోగ్యం పాలవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌లో తరుచూ తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్, ఐదు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలన్నారు.


ఏమిటీ మయోనైజ్?


మయోనైజ్‌ ఎక్కువగా బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్‌విచ్, ఇతర ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకొని తినే ఆహార పదార్థం. మయోనైజ్‌ను గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, నూనె, ఉప్పుతో తయారు చేస్తారు. ఉడికించని పదార్థం కాబట్టి మయోనైజ్‌లో హానికర బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ మయోనైజ్ కారణంగా చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ హోటళ్లు తీరు మార్చుకోకపోవడంతో ఫుడ్ సేఫ్టీ విభాగం రంగంలోకి దిగి నిషేధం విధించాలని నిర్ణయించింది.


బంజారాహిల్స్, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో మయోనైజ్‌ను తిన్నవారు అనారోగ్యానికి గురైనట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లోని పలు హోటళ్లలో దాడుల సమయంలోనూ నాసిరకం మయోనైజ్‌ను అధికారులు గుర్తించారు. అదేవిధంగా, సికింద్రాబాద్, టోలిచౌకి, చాంద్రాయణగుట్ట, కాటేదాన్, బంజారాహిల్స్‌లోని పలు హోటళ్లలోని షవర్మ, మండి బిర్యానీ, బర్గర్ల పైనా బల్దియాకు ఫిర్యాదులు అందాయి.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >