| Daily భారత్
Logo




జైలు నుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలి : వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

News

Posted on 2025-04-29 22:42:34

Share: Share


జైలు నుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలి : వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

డైలీ భారత్, వరంగల్:దొంగతనాలను కట్టడి చేసేందుకు చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలునుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలని కమిషనర్‌ అధికారులకు పిలుపునిచ్చారు. మార్చ్ నెల సంబంధించి నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ కమిషనరేట్‌ కార్యాలయములో నిర్వహించారు. వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన పోలీస్‌ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకొని, కేసుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీ షీటర్లను పోలీస్‌ స్టేషన్‌ పిలిపించడం కాకుండా, అధికారులు రౌడీ షీటర్లను వ్యక్తిగతం కలుసుకోవడం లేదా పరిసరాల్లో వుందే వారి నుండి రౌడీ షీటర్‌ ప్రస్తుత స్థితిగతులను ఆరా తీయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలని, ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో సిసి కెమెరాలు కీలకంగా నిలుస్తున్నాని, ఇందుకు గాను పోలీస్ స్టేషన్ పరిధిలో కెమెరా పనితీరుపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కొత్త సిసి కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, పోలీస్ స్టేషన్ ల్లో పని చేసే మహిళా సిబ్బందితో అన్ని రకాల విధుల్లో రాణించే విధంగా వారిని ప్రోత్సహించడంతోపాటు మహిళా సిబ్బందిలో స్టేషన్ అధికారులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని జాతీయస్థాయిలో గుర్తింపు, అవార్డులు తీసుకొచ్చే విధంగా పోలీస్ స్టేషన్ నిర్వహణ ఉండాలని, రేయి పగలు ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటుందని పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే పోలీసు అధికారులకు రివార్డులు అవార్డులు ఉంటాయని పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు.

ఈ సమావేశంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్‌, అంకిత్‌కుమార్‌, జనార్దన్, జనగాం ఏఎస్పీ చైతన్య, ఏ.ఎస్పీ మనాన్‌భట్‌, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు పాల్గోన్నారు.


#warangal

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >