| Daily భారత్
Logo




హైదరాబాద్ మెట్రో రైలు టిక్కెట్ ధరలు భారీగా పెంపు!

News

Posted on 2025-05-17 09:25:54

Share: Share


హైదరాబాద్ మెట్రో రైలు టిక్కెట్ ధరలు భారీగా పెంపు!

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో సంస్థ రైల్ టికెట్ ధరలను పెంచుతూ ఎల్‌అండ్‌టీ మెట్రో నిర్ణయం తీసకుంది. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

ప్రస్తుతం కనిష్ఠ ఛార్జీ రూ. 10 ఉండగా.. దాన్ని రూ. 12కు పెంచారు. ఇక గరిష్ఠ ఛార్జీ రూ. 60 ఉండగా.. దాన్ని రూ. 75కు పెంచారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు తెలు స్తోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిం దని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు.

దానికి తోడుగా..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 

ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 - రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఛార్జీల పెంపు మెట్రో సేవలను కొనసాగిం చడానికి, మౌలిక సదు పాయాలను మెరుగు పరచడానికి సహాయప డుతుందని అధికారులు భావిస్తున్నారు. 

అయితే ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం మోపనుంది. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశన్నంటుతుండగా.. మెట్రో ఛార్జీల పెంపు వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టనుంది.

కాగా, మెట్రో రైల్వేస్ చట్టం 2002లోని సెక్షన్ 34 ప్రకారం, చార్జీల సవరణ స్వరూపాన్ని సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) ఏర్పాటైందని మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >