Posted on 2025-05-29 18:06:51
డైలీ భారత్, మహబూబాబాద్ జిల్లా : కొత్తగూడ మండలం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతామని నోటిమాటలు తప్ప ఆచరణ ఉండటం లేదని, ఇస్తున్న హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారని టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల సాంబయ్య అన్నారు.
ఆ సంఘం ఆవిర్భావ దినోత్సవం కొత్తగూడ, గంగారం మండలాల బాధ్యులు తీగల రమేష్, మేడ నరసింహారావు, అయిలబోయున శ్రీకళ గారాల ఆధ్వర్యంలో కొత్తగూడ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ వద్ద టీపీటీఎఫ్ జెండాను ఎగురవేశారు.
అనంతరం సాంబయ్య మాట్లాడుతూ విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి అందులో సగం మాత్రమే ఇస్తున్నారని మాటకు, చేతులకు పొంతన ఉండడం లేదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్తరకం పాఠశాలను నెలకొల్పి అప్పటికే ఉన్న పాఠశాలను బలి పెడుతున్నారని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సమీకృత గురుకులాలు, యంగ్ ఇండియా స్కూల్లకు పిల్లలను ఎక్కడినుండి తెస్తారని ప్రశ్నించారు. గ్రామాలలో ఉన్న బడులలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా పట్టణ ప్రాంతాలలో ఆకాశ హార్మాలు నిర్మిస్తే అందరికీ విద్య అనే ప్రాథమిక హక్కు కు తూట్లు పొడిచినట్లెనని అన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించి టీచర్ల ఏకాగ్రత ,శ్రద్ధ పిల్లల మీద మాత్రమే పెట్టే ప్రశాంత వాతావరణం కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. సమస్యల పరిష్కారం కోసం అడిగితే ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడం సరికాదని అన్నారు. బడిబాటను మొక్కుబడిగా కాకుండా ప్రజా ప్రతినిధులు అధికారుల భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు యాదగిరి, రవి ,భరత్, సూర్యనారాయణ ,రమేష్, సాంబయ్య ,ప్రశాంత్ పాల్గొన్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >